ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా రైతు వేదికలో శుక్రవారం 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల తోపాటు నలుగురికి కల్యాణ లక్ష్మి, ఆరుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలోపు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులందరూ బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని, లేని పక్షంలో వారి మంజూరు పత్రాలను రద్దు చేసి వేరే వారికి ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ప్రజలు మరియు లబ్ధిదారులు సహకరించాలని కోరారు.చింతలమానేపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశామని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు.చింతల మానేపల్లి మండల కేంద్రంలో 33/11 KV సబ్స్టేషన్ నిర్మాణం కోసం కూడా ప్రతిపాదన పెట్టామని దీనితో మండలంలో పూర్తిస్థాయిలో లోవోల్టేజ్ సమస్య తీరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుధాకర్ రెడ్డి, ఎమ్మార్వో ప్రకాష్, మాజీ జడ్పీటీసీ ఎల్ముల మల్లయ్య, సర్పంచులు బాలు, అంకులు, కుమ్మరి శ్రీధర్, తిరుపతి, అశోక్, ఉపసర్పంచులు డబ్బులు మురళీ, జైరాం, తిరుపతి, మాజీ ఎంపీటీసీ తిరుపతి, బీజేపీ పార్టీ నాయకులు సత్పుతే తుకారాం, డబ్బులు రావు, ధనూరి సాయి, నవీన్, శంకర్ పురుషోత్తం, పోషన్న కొంపరి బాలాజీ, హరికృష్ణ, తిరుపతి కొంపరి సాయి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News