Wednesday, 01 April 2026 01:54:34 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

లోక కళ్యాణార్థం గోదావరి పరిక్రమ యాత్ర

Date : 15 December 2025 06:45 PM Views : 757

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ రాజేంద్ర దాస్ మహారాజ్ బృందావన్ మాలూక్ పీఠాధిపతి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోదావరి పరిక్రమ యాత్రను 500 మంది పీఠాధిపతులతో నాసిక్ లో నుండి ప్రారంభించారు. మన ప్రాంతంలోని మంచిర్యాల బీజాపూర్ చత్తీస్గడ్ మీదుగా భద్రాచలం చేరుకొని కొవ్వూరు మీదుగా ఆదివారం కాళేశ్వరం వద్ద బస చేశారు. సోమవారం త్రివేణి సంగమంలో స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మంథని మీదుగా ధర్మపురి వెళ్లే యాత్రలో భాగంగా ఈరోజు మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఇందులో భాగంగా అయోధ్య వారణాసి తదితర పీఠాధిపతులకు పండ్లు అందించి వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున హిందూ బంధువులతో పాటు విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బోట్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బత్తుల సత్యనారాయణల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, ప్రచారక్ తూర్పాటి రాము, సత్సంగ ప్రముక రాజమౌళి గౌడ్, కొమురవెల్లి హరీష్, గుండా శ్రీనివాస్, బొడ్డు వెంకటేష్, నూక శ్రీనివాస్, మాచిడి శ్రీధర్, కజ్జం శ్యామ్, కొమురవెల్లి సత్యనారాయణ, బొడ్డు సంపత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాతృశక్తి ప్రముఖ్ రావికంటి రేణుక, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :