Saturday, 13 June 2026 02:57:22 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి

టి.షాజహాన్ బేగం నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

Date : 08 June 2026 07:11 AM Views : 39

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్లో నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు రక్షణ కల్పించే ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలువవలసిన కూటమి ప్రభుత్వం భారతదేశ సమగ్రతను కాపాడవలసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయిన నెల మే నెలలో గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ఎంతోమంది హోటల్లో ఉన్న వ్యాపారస్తులకు ముఖ్యంగా మహిళలకు నష్టం కలిగించడమే కాకుండా మరొక్కసారి ఈ జూన్ నెలలో కూడా 29 రూపాయలు గ్యాస్ ధరలను పెంచి మరొక్కసారి వెన్నుపోటు పొడిచారని ఈ విషయంలో ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయమని నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేకుంటే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ ప్రజలే ఆందోళన చేసి నరేంద్ర మోడీనిగద్దె దించే వరకు నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము అని అన్నారు. ఈ విషయంలో ఒకటే కాదు ప్రతి విషయంలో నరేంద్ర మోడీ ని దేశ ప్రజలు బాగా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే మంచి తీర్పు ఇవ్వాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఇటువంటి ప్రధానమంత్రి దేశ ప్రజలకు అవసరమా అని మహిళా కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజవర్గ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :