Thursday, 30 July 2026 06:51:35 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

"పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమం" పోస్టర్ లను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు జమాత్ అధ్యక్షులు చాందన్న

Date : 21 November 2025 07:17 PM Views : 260

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ / ఎమ్మిగనూరు : జమాఆతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని ఎమ్మిగనూరు పట్టణంలో అమీరె ముఖామి జనాబ్ చాంద్ బాష చేతుల మీదుగా పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మౌలానా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలువాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచుటకు, ప్రజలలో సామాజిక చింతన కలిగించుటకు జమాఅతె ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా నవంబర్-21 నుండి 30వ తేదీ వరకు "పొరుగువారి హక్కుల ఉద్యమం" నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగుపొరువారితో సత్సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు పరస్పర సహాయ సహకారాలు, అన్యోనతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని పోతామని, దైవ గ్రంధం ఖుర్ఆన్ తాకీదు చేసిన, ప్రవక్త ప్రవచనాల్లొ భోధించిన పోరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని, ముస్లిం సమాజాన్ని కోరుతామని తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల వారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తామని తెలిపారు. ఇరుగు- పొరుగువారు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ ఉద్యమ నిర్వహణకు జనాబ్ ఖదీర్ భాష కన్వీనర్ గా వ్యవహరిస్తారన్నారు. చాంధన్న మాట్లాడుతూ స్థానికంగా ప్రతీ ఏరియాలో ఉన్న కళాశాలల్లో, పాఠశాల ప్రాంగణాల్లో పొరుగువారి బాధ్యతలు గుర్తు చేస్తామని, శుక్రవారం ప్రసంగాల్లో, కార్నర్ మీటింగుల్లో పొరుగవారి హక్కులు, సంబంధ బాంధవ్యాల ఆవశ్యకత గురించి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖిద్ మత్ డైరెక్టర్ అల్తాఫ్, లాల్ సాబ్, అభిరామ్, అమీర్, ఖదీరన్న, మహేష్, జాకీర్, నందవరం రహీమ్, కుమార్, అలీ, హుస్సేన్, రెహమాన్, ముఖామి జమాత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :