ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ప్రభుత్వ హాస్టల్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని, బైర్లుటి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ హాస్టల్లో కచ్చితంగా మెనూ పాటించాలని మంచి నాణ్యమైన భోజనం కూరగాయలు వండి పెట్టాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు వసతి గృహాలకు నిధులు విడుదల చేస్తుందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రతి వార్డెన్ నిధులు దుర్వినియోగం కాకుండా మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన అన్నారు. ఈరోజు చికెను కలర్ రైస్ గోంగూర చట్నీ ఉండగా గోంగూర చట్నీ లేకుండా వట్టి చికెన్ కలర్ రైస్ వండారని మెనూ పాటించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. నాసిరకం భోజనాలు పెడితే, పిల్లలు అస్వస్థతకు గురి అయితే, క్షమించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News