Thursday, 30 July 2026 06:31:39 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 23న ఆత్మకూరులో జరిగే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి

Date : 17 July 2026 09:36 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలోని, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న, ఎన్టీఆర్ కె.వి.ఆర్. స్టేడియం నందు జూలై- 23 న తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి ఈ జాబ్ మేళాకు సంబంధించి మండల కేడీసీసీ సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్, పట్టణ టిడిపి నాయకులు వేణు, టిడిపి మండల నాయకులు రవీంద్ర, మాజీ టీడీపీ మండల నాయకులు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మైనార్టీ నాయకులు నాగుర్, మాజీ టీడీపీ ఎంపీటీసీ లు లింగస్వామి, శ్రీను మిగతా టీడీపీ నాయకులు గోవర్దన్ రెడ్డి, శంకర్, దినకర్, గంగాధర్ రెడ్డి మరియు మండల టిడిపి నేతలు ఆత్మకూరు పట్టణంలోని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 10ప్రైవేట్ కంపెనీలు ఎస్ ఎస్ కె జి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మణిపాల్ సిగ్న ప్రైవేట్ లిమిటెడ్, హ్యుందాయ్ గ్లోవిస్, యూనికోసాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్, ఫోన్ పే, భారత్ ఫైనాన్స్ ఎంక్లూసన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ డిక్సెన్ టెక్నాలజీస్, సుజల పైప్స్ మరియు టాటా ఎలెక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన హెచ్ ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనుటకు పదవ తరగతి పాసై, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బి/డి/ఎం ఫార్మసీ మరియు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కావున జిల్లాలోని, నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగము చేసుకోగలరని తెలియ జేశారు. వీటికి సంబంధించిన ఇతర వివరముల కొరకు 9951400588, 9154830286 ఫోన్ నెంబర్లకు లేదా naipunyam.ap.gov.in సంప్రదించాలని తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :