Thursday, 30 July 2026 10:05:03 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఇరాన్ హార్మోజ్ జల సంధి నుండి పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చిన గొప్ప వీరనారి కేరళ మేరైన్ ఇంజనీర్ హిఫా సలీమ్

Date : 11 July 2026 08:41 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ఆమె పేరు హిఫా సలీమ్. స్వస్థలం కేరళ రాష్ట్రంలోని, త్రిసూర్ జిల్లా ఎడక్కళియూర్. ఒంటరి పోరాటం ఆ యుద్ధ నౌకలోని, 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే మహిళా మెరైన్ ఇంజనీర్. హార్మోజ్ విజేత ప్రాణాలకు తెగించి, వ్యూహాత్మక 'హార్మోజ్ జలసంధి'లో క్షిపణుల మధ్య 100 రోజుల పాటు పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చింది. గౌరవ ముద్ర నౌకలో ఆమె చూపిన ధైర్యానికి మెచ్చి తోటి సిబ్బంది అంతా ఆమెను గౌరవంగా 'పాంచ్‌ సాహెబ్‌' (ఫిఫ్త్‌ ఇంజనీర్‌) అని పిలుచుకుంటారు. ప్రస్తుతం హిఫా సలీమ్‌ తన తదుపరి ఉన్నత ర్యాంక్‌ (ఫోర్త్‌ ఇంజనీర్‌) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్‌ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం,ఆదర్శం. హార్మోజ్‌ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే 'పాంచ్‌ సాహెబ్‌'గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. 'ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్‌ రంగానికి పనికిరారు' అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్‌ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది. భయానికి ఎదురెళ్లి గెలిచి, భారతదేశ కీర్తిని సముద్రాల అవతలకు చాటి చెప్పిన వీరనారి హిఫా సలీం యువతకు ఆదర్శం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :