ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : విజయవాడలోని, వెలగపూడిలో ఉన్న సచివాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నేడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలిసి నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే శ్రీశైలం, మహానంది దేవస్థానాల అభివృద్ధి, సాగునీటి పథకాలకు నిధుల మంజూరుతో పాటు నియోజకవర్గంలో 100శాతం అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, త్రాగునీటి కుళాయి సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధికి మరింత తోడ్పాటును అందిస్తానని, పెండింగ్ లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేసి, వెంటనే పూర్తి చేసేందుకు హామీ ఇచ్చారు.
Admin
E Nivas News