ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, 80- బన్నూరు గ్రామంలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పథకం క్రింద 43.10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతనంగా ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంక్ ను నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, ఎంపీడీవో డి.గోపికృష్ణ, తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, పరమేశ్వర రెడ్డి, ప్రసాద రెడ్డి, పిక్కిలి శ్రీనివాసులు, శేఖర్ గౌడ్, కాతా రమేష్ రెడ్డి, గుండం రమణారెడ్డి, పోలీస్ సిబ్బంది, మాండ్ర శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, గ్రామ మరియు మండల నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News