Thursday, 30 July 2026 08:17:48 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పాఠశాల భవనం నిర్మించాలనీ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్

Date : 22 April 2026 06:25 AM Views : 186

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని, అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ కోరుతూ సోమవారం నాడు ఆత్మకూరు పట్టణంలో మండల అభివృద్ధి అధికారి- పి.నాగేంద్రుడు కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ ఎంపీడీవో- పి.నాగేంద్రుడు కు విన్నవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అమలాపురం చెంచుగూడెంలో 50 కుటుంబాల చెంచు గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, .వారికి ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన అన్నారు. అక్కడ చదువుకునే చాలా మంది విద్యార్థులు ఉన్నారను, ప్రభుత్వం ఒక ఉపాధ్యాయురాలుని కూడా నియమించిందన్నారు. పది సెంట్లు పాఠశాల స్థలం కూడా ఉందనీ. కానీ పాఠశాల భవనం మాత్రం లేదనీ. చదువుతోనే గిరిజనుల అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదనీ. ఎన్నికల సమయంలో మాత్రమే చెంచు గిరిజనులు గుర్తుకు వస్తారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈరమ్మ, నాగరాజు, నరేష్ ‌, బయ్యన్న పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :