ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో, 76వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, ప్రజాసంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భముగా ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ 1949 నవంబర్-26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందన్నారు. దేశం అత్యున్నత చట్టమైన ఈ రాజ్యాంగం తయారుచేయడానికి మొత్తం 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు పట్టింది.డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని తుది రూపానికి తెచ్చారన్నారు.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత 2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్-26ను అధికారికంగా ‘రాజ్యాంగ దినోత్సవం’గా ప్రకటించిందన్నారు. ప్రధానంగా రాజ్యాంగ నిర్మాతల కృషిని స్మరించుకోవడమే దీని ఉద్దేశం. దేశ ప్రజల హక్కులను రక్షించుకోవడం, ప్రజాస్వామ్యం, సమానత్వం, లౌకికత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను మెరుగుపరచడమే లక్ష్యం అని అన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, కర్తవ్యాలు, విధాన మార్గదర్శకాలను ప్రజలకు గుర్తు చేసే దినోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News