Friday, 31 July 2026 04:53:32 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన వీరాభిమాని టి.షాజహాన్ బేగం

Date : 30 December 2025 09:09 PM Views : 278

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లాలో, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన వీరాభిమాని & సమాజ సేవకురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ సేవకురాలు టి.షాజహాన్ బేగం, రజక సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి మౌలాలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు టి.మౌలాలి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుబ్బమ్మ, తదితర నాయకులు, రక్తదాతల ఆధ్వర్యంలో భారీ కేకులు కట్టింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం రక్తదాతలు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వీరందరికీ వీరాభిమాని టి.షాజహాన్ బేగం పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలియజేసి,అభినందించడం జరిగింది. మన నందికొట్కూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా జూపాడుబంగ్లాలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థర్ అభిమానులు 30 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. మహిళలు, ఆర్థర్ అభిమానులు కేక్ కట్ చేసి, ఆర్థర్ కి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం, జిల్లా నాయకులు టి.మౌలాలి లు మాట్లాడుతూ ఆర్థర్ ప్రజల మనిషి అందరిని ఆదరించే వ్యక్తి ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరకాలం బతికే ఉంటాయని చెప్పారు. అలాంటి గొప్ప ఎమ్మెల్యే ఉన్నట్టుగా ఏ ఎమ్మెల్యే ప్రజలకు ఆదరించలేదని ఇలాంటి మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు కోరాలి అని చెప్పారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సిహెచ్ఓ మౌలాలి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆర్థర్ వంటి గొప్ప నాయకుడిని ఎన్నటికీ మరువకూడదని మంచి మనసున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థర్ వీరాభిమానులు, మహిళలు స్వచ్ఛందంగా సంతోషంగా పాల్గొన్నారు. ఇలాంటి మంచి వ్యక్తి అయినా మన ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసినవారికి, మరియు అక్షయ బ్లడ్ బ్యాంకు వారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :