ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల మున్సిపల్ కార్యాలయము నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా షెఫర్డ్ సొసైటీ అధ్యక్షులు సురేష్, మెప్మ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5 న ప్రపంచ అన్ని దేశాలలో జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం మరియు సమిష్టి చర్యలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న గాలి, నీరు, భూమి, మొక్కలు మరియు జంతువులను కలిగి ఉన్న సహజ వ్యవస్థ. జీవకోటి మనుగడకు పర్యావరణం మూలాధారం. అయితే, నేడు మానవ కార్యకలాపాల వల్ల ఈ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందనీ అన్నారు. కాలుష్యానికి గల కారణాలు అడవుల విచక్షణారహిత నరికివేత, ప్లాస్టిక్ వాడకం, పారిశ్రామిక వ్యర్థాలు, మరియు వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా భూతాపం మరియు వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి. ఇది మానవ ఆరోగ్యంతో పాటు సమస్త జీవకోటికి ముప్పుగా మారింది.మన కర్తవ్యం:ఈ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.విరివిగా మొక్కలు నాటాలి, నీటిని, విద్యుత్తును, పెట్రోలు ,డీజిల్ ఆదా చేయాలన్నారు. స్వచ్ఛమైన వాతావరణాన్ని కాపాడటానికి అందరూ భాగస్వామ్యం కావాలనీ పర్యావరణాన్ని కాపాడుకుంటే, అది మనల్ని కాపాడుకుంటుందనీ అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని భూమిని అందించడం మనందరి ప్రాథమిక కర్తవ్యం .ప్రపంచ పర్యావరణ దినోత్సవం - ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను ప్రతి సంవత్సరం జూన్-5వ తేదిన జరుపుకుంటున్నాము. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కొన్ని నిజాలు ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ రకరకాల కాలుష్యాలను సముద్రాల్లోకి పంపిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉందనీ ఇవి చాలనట్లు అధిక జనాభా సమస్య మరొకటి అని అన్నారు. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న సహజ వాతావరణం అని, ఇందులో గాలి, నీరు, భూమి, వృక్షజాతులు, జంతుజాలం, మానవులు భాగమై ఉన్నారన్నారు. పర్యావరణం మన జీవనానికి ఆధారం. ప్రతి జీవికి పర్యావరణం బ్రతకడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే పర్యావరణం గురించి అవగాహన పెంచడానికి మరియు మానవ కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలను నివారించడానికి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి 1973 నుండి ఏటా జూన్-5వ తేదీన నిర్వహించబడుతుందనీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం - వాతావరణ మార్పులపై దృష్టి సారిస్తుందన్నారు. భూమి పంపుతున్న అత్యవసర సంకేతాలు మరియు మేము తిరిగి పంపడానికి ఎంచుకున్న సంకేతాలపై యొక్క గ్లోబల్ పర్యావరణ కాలుష్యం పర్యావరణ కాలుష్యం అనేది ఒక దృగ్విషయం, ఇక్కడ సహజ పదార్ధాలు ప్రమాదకరమైన అసహజ పదార్ధాల ఉనికి ద్వారా భర్తీ చేయబడతాయి లేదా దెబ్బతిన్నాయన్నారు. ఇవి వ్యవస్థకు అసమతుల్యతను ప్రపంచ పర్యావరణ దినోత్సవం మానవ అభివృద్ధి పేరుతో విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు, వ్యర్థాలతో భూతాపం పెరుగుతోందనీ అన్నారు. భూమి, వాయు, జలకల, నేలతల్లిని రక్షించుకుందాం అని, ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంపై అందరికీ అవగాహన పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపునకు కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనిధి హోటల్ యజమాని మరియు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సెక్రెటరీ రఘువీర్, బర్నబాస్, లక్ష్మీదేవి, అరుణ, స్వాతి, రిక్వానంద రెడ్డి, శివరాం రెడ్డి, నార్ల ప్రకాశం, సుందర్, సుబ్బయ్య, జాన్, తేజోమయం మొదలగువారు పాల్గొన్నారు.
Admin
E Nivas News