Wednesday, 01 April 2026 01:56:00 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

ప్రభుత్వం పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలి

Date : 20 November 2025 09:06 PM Views : 870

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో లేకుండా, కేవలం పాఠశాల పనిదినాల్లో మాత్రమే నిర్వహించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్. చాంద్ బాష లు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నంద్యాల జిల్లా, వెలుగోడు మండలంలోని, అన్ని గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఆ విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి. పదోన్నతులు కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు కోసం, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐ.ఆర్. మధ్యంతర భృతి ఇవ్వాలని, జి ఆర్-11 హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్, లాంగ్వేజ్ & స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుకు ఎస్జీటీ లకు పదోన్నతులు కల్పించాలని, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు వెలుగోడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ అహద్, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ జిల్లా నాయకులు మహేష్, మునిరెడ్డి, బాపూజీ నాయక్, మోమిన్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి తగిన ప్రాతినిధ్యం వహిస్తామని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :