Saturday, 13 June 2026 03:04:43 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ప్రభుత్వం పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలి

Date : 20 November 2025 09:06 PM Views : 1015

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో లేకుండా, కేవలం పాఠశాల పనిదినాల్లో మాత్రమే నిర్వహించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్. చాంద్ బాష లు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నంద్యాల జిల్లా, వెలుగోడు మండలంలోని, అన్ని గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఆ విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి. పదోన్నతులు కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు కోసం, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐ.ఆర్. మధ్యంతర భృతి ఇవ్వాలని, జి ఆర్-11 హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్, లాంగ్వేజ్ & స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుకు ఎస్జీటీ లకు పదోన్నతులు కల్పించాలని, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు వెలుగోడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ అహద్, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ జిల్లా నాయకులు మహేష్, మునిరెడ్డి, బాపూజీ నాయక్, మోమిన్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి తగిన ప్రాతినిధ్యం వహిస్తామని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :