Friday, 31 July 2026 05:31:37 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వం పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలి

Date : 20 November 2025 09:06 PM Views : 1105

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో లేకుండా, కేవలం పాఠశాల పనిదినాల్లో మాత్రమే నిర్వహించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్. చాంద్ బాష లు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నంద్యాల జిల్లా, వెలుగోడు మండలంలోని, అన్ని గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఆ విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి. పదోన్నతులు కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు కోసం, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐ.ఆర్. మధ్యంతర భృతి ఇవ్వాలని, జి ఆర్-11 హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్, లాంగ్వేజ్ & స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుకు ఎస్జీటీ లకు పదోన్నతులు కల్పించాలని, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు వెలుగోడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ అహద్, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ జిల్లా నాయకులు మహేష్, మునిరెడ్డి, బాపూజీ నాయక్, మోమిన్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి తగిన ప్రాతినిధ్యం వహిస్తామని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :