Friday, 31 July 2026 02:32:28 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అగ్రిగోల్డ్ భూముల భౌతిక ప‌రిశీల‌న‌...! క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్యేక క‌మిటీ సంద‌ర్శ‌న‌

విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌

Date : 23 January 2026 09:32 AM Views : 248

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్ర‌భుత్వం అటాచ్ చేసిన భూములను క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి, సేక‌రించిన వివ‌రాలతో నివేదికను రూపొందించడం జ‌రుగుతోంద‌ని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య అన్నారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా గురువారం విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య, జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు రెవెన్యూ, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ‌, సీఐడీ, ఈ-ఆక్ష‌న్స్ త‌దిత‌ర విభాగాల అధికారుల‌తో కూడిన జిల్లాస్థాయి క‌మిటీ విజ‌య‌వాడ‌లోని, వివిధ ప్రాంతాల‌ను సంద‌ర్శించడం జరిగింది. లోట‌ల్ ల్యాండ్ మార్క్‌, పాయ‌కాపురం, వాంబే కాల‌నీలోని మూడు స‌ర్వే నంబ‌ర్ల‌లోని భూముల‌ను క‌మిటీ స‌భ్యులు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌డీవో చైత‌న్య మాట్లాడుతూ అగ్రీగోల్డ్‌కు సంబంధించి ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ స‌భ్యులు తాజాగా మూడు ఆస్తుల‌ను భౌతిక ప‌రిశీల‌న చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ త‌నిఖీల్లో సేక‌రించిన ఆస్తుల స‌మాచారం ఆధారంగా లిటిగేష‌న్ లేని భూముల వేలం ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా రీస‌ర్వే, ప్ర‌భుత్వ విలువ‌, మార్కెట్ విలువ‌, మ్యుటేష‌న్ త‌దిత‌ర వివ‌రాల‌తో నివేదిక‌లు పంప‌నున్న‌ట్లు ఆర్‌డీవో చైత‌న్య తెలిపారు. ఈ క్షేత్ర‌స్థాయి త‌నిఖీలో జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్ర‌సాద్, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :