ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల నాయకుడు జి.హరి ప్రసాద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా నూతన అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు.చరిత రెడ్డికి పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాములపాడు మండల నాయకుడు & మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్- జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ నందికొట్కూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు.వెంకట్ రెడ్డి, పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి లు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తమ నియోజకవర్గాలలోనే కాకుండా జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తలను స్నేహపూర్వకంగా కలుపుకొని ముందడుగు వేసే మంచి గుణము ఆ కుటుంబానిదని అన్నారు. ఏ నాయకుడు గానీ, ఏ కార్యకర్తగాని కష్టాల్లో ఉంటే మేమున్నామని మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చే కుటుంబం వారిదని అన్నారు. వారు చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేసినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల నాయకులు హరినాధ రెడ్డి, శివ శంకర్ స్వామి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News