Friday, 31 July 2026 03:53:17 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ద్వారా తక్షణమే ఏర్పాటు చేయాలి

మద్దతు ధర 2400/- ప్రకారం వ్యాపారస్తులు కొనుగోలు చేయాలి పి.వెంకటేశ్వర్లు (సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి)

Date : 11 November 2025 07:51 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మంగళవారం సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ పార్టీ అఖిలభారత కిసాన్ మహాసభ బృందం మొక్కజొన్న రైతులను కలిసి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న పంటను నంద్యాల జిల్లాలో విస్తారంగా పండించారని అనేక తుఫాన్ వల్ల రైతుల పంట దిగుబడి తగ్గిందని ఎకరాకు కనీసం 15 కింటాలు కూడా దిగుబడి రావడం లేదని రైతు ఎకరాకు పెట్టుబడి 30 నుండి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట నష్టపోవడం జరిగిందన్నారు. తీరా చూస్తే పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. దీనికి తోడు. ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పంటను పండించిన మార్కెట్లో అమ్మేసరికి ప్రభుత్వం మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు, దళారులు కుమ్మక్కై 1700/- ,1600/- రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని దీనివలన రైతు క్వింటాలుకు 600 రూపాయలు నష్టపోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు రైతులు నష్టపోతున్న చూసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే మొక్కజొన్న రైతులు 60% పైనే పంట కోత కోశారని మరి కొద్ది రోజుల్లోనే పంట పూర్తయ్య పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం పెంచినటువంటి ధర దళారులకు వ్యాపారస్తులకు దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది అని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేదికలపైన గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అందువలన తక్షణమే మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాలు అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 40 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని, రైతులకు.రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు టి.నరసింహులు, వేల్పుల.ఏసన్న, శ్రీరాములు, రుద్రవరం గ్రామ రైతులు గొల్ల సురేష్. ఎస్.సద్దాం, నబిరసూల్, అల్లా ప్రకాష్, మహేష్, మన్సూర్, రాజు, శాలు భాష తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :