ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ గడివేముల : - గడివేముల మండలంలోని, గని గ్రామంలో ఒక వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ (రాయపాటి)సి.సావిత్రి నీ పాములపాడు మండలం బిజెపి అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్. గోపాల్, తదితర ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అనంతరం వారందరూ రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వానాల నాగరాజు,కేతురు మధు, అడ్వకేట్ చంద్రశేఖర్. గోల్డు్మెన్ శ్రీను, పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్. ఆర్.గోపాల్, నంద్యాల జిల్లా రజక జిల్లా అధ్యక్షులు నాగరాజు, జూపాడుబంగ్లా మండల టీడీపీ నాయకులు కడియం పుల్లన్న యాదవ్. శ్రీశైలం సత్రం కోశాధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News