Friday, 31 July 2026 06:16:26 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బాధిత మహిళలకు గౌరవం, న్యాయం కల్పించేందుకు ఈ సెంటర్

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 04 February 2026 09:23 PM Views : 167

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : వ‌న్ స్టాప్ సెంట‌ర్లు (ఓఎస్‌సీ).. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పిస్తున్నాయ‌ని.. బాధిత మ‌హిళ‌ల‌కు గౌర‌వం, న్యాయం క‌ల్పించేందుకు కృషిచేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఇగ్నైట్ సెల్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. సఖి వన్ స్టాప్ సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడం, బాధిత మహిళలకు తక్షణం, సమగ్ర సహాయం అందించ‌డంలో స‌ఖి - వ‌న్ స్టాప్ సెంట‌ర్ కీల‌క‌పాత్ర పోషిస్తోంద‌న్నారు. బాధిత మ‌హిళ‌ల‌కు ఒక్కచోటే అవసరమైన అన్ని సేవలు పొందేలా ఈ కేంద్రాలు చేయూత‌నిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌త్యేక వాహ‌నంతో బాధితులకు త్వరితగతిన కౌన్సిలింగ్, వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సహాయం వంటి సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు వీల‌వుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌తో పాటు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌న్నారు. మ‌హిళా సాధికార‌త‌తో పాటు మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌ వేత్త‌లుగా ఎదిగేలా చేసేందుకు అహ‌ర్నిశ‌లు కృషిచేస్తోంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, విజయవాడ అర్బన్ సీడీపీవో జ్యోత్స్న, మిషన్ శక్తి కోఆర్డినేటర్, సూపర్వైజర్లు, ఆంగన్‌వాడీ కార్యకర్తలు, సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :