ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పాణ్యం నియోజవర్గం, ఓర్వకల్లు మండలంలోని, లొద్దిపల్లె గ్రామంలో న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు డాక్టర్ కే.తిరుపాల్ రెడ్డి, ఉమాదేవి, కె.వెంకటరామిరెడ్డి, కె.రామేశ్వరమ్మ దంపతుల సహకారంతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా 36 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు. చరిత రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జీ.నాగముని లు మాట్లాడుతూ పీ4 ద్వారా దాతలు ప్రజల కోసం కుట్టు మిషన్లను అందించడం సమాజ సేవా భావనకు నిదర్శనమని అభినందించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కుట్టుశిక్షణను ఇచ్చి, ఉచితంగా మిషన్లు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వారు బీసీ బాలుర హాస్టల్ మరియు వసతి గృహాన్ని పరిశీలించి, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవనం నిర్మాణం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ నాగిరెడ్డి, న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News