ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం వెంటనే అమలు చేయాలని నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు టి.షాజహాన్ బేగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బాగా ప్రచారం చేసిన స్కీం పథకం ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, ప్రతినెల 1500 రూపాయలు ఇస్తామని, సంవత్సరానికి 18 వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని ఆశపెట్టిన ప్రభుత్వం సంవత్సరాలు దాటిపోతున్న ఇంతవరకు ఆచూకీ లేదు బాబు షూరిటీ మహిళల భవిష్యత్తు అవసరానికి అని ఉపయోగించుకున్నారని సూపర్ సిక్స్ పథకాలలో మహిళలపై నాలుగు పథకాలు ఉన్న ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా అందించడంలో విఫలమయ్యారని అన్నారు. మహిళలకు అదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ అంటూ చుక్కలు చూపిస్తూ ఆందోళన చెందే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆడబిడ్డ నిధి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకానికి వస్తే మహిళలకు ఉచిత బస్సులను అవమానంగా, హేలనపరిచే విధంగా ఉందని ఎత్తి చూపారు. ప్రతి డిపో బస్సు జిల్లాలలోనీ, అన్ని మండలాలలో స్టేజి ఉన్నచోట ఆపకుండా ఇష్టం వచ్చే చోట ఆపి మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క గ్రామాల్లో అయినా, మండల కేంద్రాల్లో అయినా స్టేజీలు ఉన్నచోట ఆపకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రభుత్వానికి కనబడటం లేదా అని మహిళా కాంగ్రెస్ తరపున ఒక మహిళగా అడుగుతున్నానని చెప్పారు. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు బస్సులు కూడా ఎక్కువగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Admin
E Nivas News