ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు శాఖ గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు డాక్టర్ అయ్యంకి.వెంకట రమణయ్య, పాతూరి.నాగభూషణం, గాడిచర్ల.హరిసర్వోత్తమ రావు, డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ ల చిత్రపటాలకు టిడిపి సీనియర్ నాయకుడు కురువ.ఎల్లయ్య, గ్రంథాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి లు పాఠకులతో కలిసి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు-కే.ఎల్లయ్య, గ్రంథాలయ అధికారి-సి.వి.కృష్ణారెడ్డి లు మాట్లాడుతూ ఆ మహానుభావులు గ్రంథాలయాల అభివృద్ధికి చేసిన సేవల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠకులు నాగిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రుడు, వీరన్న, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News