ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో స్పౌస్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ పాల్గొని, నాయకులతో, కార్యకర్తలతో, సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని, ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలని ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోనాల నాగలక్ష్మమ్మ,నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బోనాల భాస్కర్, సుబ్బారావు, దార జీవన్న, తాటిపాటి నాయుడు, శ్రీను, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News