Saturday, 13 June 2026 02:58:27 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సీఎం

Date : 01 June 2026 09:52 PM Views : 59

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా సంక్షేమంతో పాటు,ఆదివాసీల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి కొత్తగూడెంలో రెండో విడత ఇండ్లను సామూహిక గృహ ప్రవేశాల కు శంకుస్థాపన చేయడంతో పాటు 118.4 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ రెండో విడతలో లక్ష ఇళ్లకు అనుమతులు ఇచ్చానన్నారు. సొంత ఇల్లు ఇవ్వాలన్నదే నా ఉద్దేశం అన్నారు. ఆదిలాబాద్ ఆదివాసీలో బిడ్డలకు సొంత ఇల్లు ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఆదివాసి ప్రజలకు 100 శాతం ఇండ్లు ఇస్తానన్నారు. నాగోబా జాతర కూడా ఆదివాసుల కోరిక మేరకు నిధులు ఇచ్చామన్నారు. మా కోడలల్లో ఆదివాసులకు పక్క ఇల్లు లేవు ఇవ్వాలని కోరాగా వెంటనే కృప నిర్మాణ అధికారులను పిలిపించి గూడాలలో లంబాడి తండాలలో పేదవారందరికీ ఇండ్లు ఇస్తాం.ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏ కార్యక్రమమైనా ఆదిలాబాద్ గడ్డమీద ప్రారంభిస్తున్నాను అని తెలిపార 70 ఏళ్లు ఆదిలాబాద్ కు జరిగిన అన్యాయణానికి పరిష్కారం చేస్తామన్నారు. మొక్కవోని దీక్షతో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కూచేస్తామన్నారు. రైతులను ఆదుకోవడమే నా ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుల పండించిన ప్రతి ఒక్క వడ్ల గింజను కూడా కొనుగోలు చేస్తానని దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలన్నారు. ఆదివాసి బిడ్డల సొంతింటి కల నెరవేర్చకపోతే నెరవేరినట్టే నాలుగో నాగోబా జాతరకు ఆహ్వానించినప్పుడు మీకేం కావాలని ఆదివాసి పెద్దలను పిసిసి అధ్యక్షుడు నిరసన ఇక్కడ చేపట్టానన్నారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లా చూడాలని నేను కోరుకుంటున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకోవడం గొప్పదన్నారు. వివక్ష లేని అభివృద్ధి చేయాలనే తన ధ్యేయమన్నారు. ఇతర పార్టీల శాసనసభ్యులు కూడా మీ పరిధిలో ఎన్ని గూడాలు ఉన్నా కూడా నా దృష్టికి తెచ్చినట్లయితే గుడిసె కూడా ఉండదు ఇడ్లిచే బాధ్యత నాదన్నారు. ఇన్చార్జి మంత్రి జిల్లాల నుండి గూడెంలో గుర్తించండి. పరిస్థితి చూడండి తర్వాత నాకు నివేదిక ఇవ్వండి అన్నారు. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లా గూడెంలలో అందరికీ పెళ్లిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు నిధులు ఇస్తానన్నారు. గూడెంలో ఒక గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొను కూడా పేద ప్రజలు నాది కూడా అన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలంటే కష్టమైన కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. టాటా బిర్లా, ఆదాని, అంబానీ లకు కూడా వారికి సొంత గృహాలు లేవా అలా గే నా ప్రజలు ఉండకూడదా అన్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పటికి ఒక లక్ష ఇరవై వేల ఇళ్లను 13 నెలల లోపల ప్రారంభించామన్నారు. తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇండ్లకు నిధులు ఇస్తా అన్నారు. ఆదివాసీల కోసం తల తాకట్టు పెట్టైనా 21 వేల ఇళ్లకు నిధులు ఇస్తానన్నారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే అవసరం లేదా మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం చేస్తున్నారని అన్నారు. వరి, మొక్కజొన్న, కందులు,జొన్నలు కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. కొనుగోలు చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి దే అన్నారు. తుమ్మిడి హెట్టి దగ్గర మహారాష్ట్ర సీఎం తో చర్చిస్తామన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తాం అన్నారు. ఆదిలాబాద్ కదిలితే మహారాష్ట్రకే నష్టం అన్నారు. నీళ్లు రైతుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వివేక్, ఎంపీ గడ్డం వివేక్,ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, పాల్వాయి హరీష్ బాబు,వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్, కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విటల్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు కార్యకర్తలు ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :