ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఓసీ అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుల సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మెన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తోపాటు గా సూపర్వైజర్ రాజ్యలక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొని,చిన్నారులతో ఓనమాలు దిద్దించారు . అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి బీజాలు వేస్తాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం చైర్మెన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నీ అంగన్వాడి నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, 4 వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, 12వ వార్డు కౌన్సిలర్ గంట్ల గౌతమ్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ నీలా లచ్చిరామ్, అంగన్వాడీ టీచర్ ముదిరెడ్డి శ్రీలత, ఆయా ఉప్పమ్మ,ముదిరెడ్డి మానస,శాబియ, రేష్మ, శ్రావణి, సుమతమ్మ, షామీమ్, అస్మా, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News