Friday, 31 July 2026 09:43:36 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రెస్ క్లబ్‌ను ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Date : 12 January 2026 07:08 PM Views : 382

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రాన్ మీడియా డివిజన్ ప్రెస్ క్లబ్ ను సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకపాత్ర ఉందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎలక్ట్రానిక్ మీడియా విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ప్రారంభంతో మంథని ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఒక వేదిక ఏర్పడిందని, ఇది మీడియా ఐక్యతకు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని క్లబ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జంజర్ల శంకర్, ఉపాధ్యక్షులు ఖాన్, ప్రధాన కార్యదర్శి మాచిడి కిరణ్, కార్యదర్శి బండ లక్ష్మీనారాయణ, కోశాధికారి మాచిడి రాజేంద్రప్రసాద్, చిట్టి మిల్ల సంతోష్, శివప్రసాద్, రావికడి సతీష్, గోపాల్, శ్రవణ్ కుమార్, సత్యనారాయణ తో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :