ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల కొత్తగా నియామకమైన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం మొదటి సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హాజరయ్యారు. బైపాస్ వద్ద శాలువాతో సన్మానించి పుష్పగుచ్చమిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షులు డా నరేష్ జాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండాటి పి సి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన కాంగ్రెస్ పార్టీ నూతన జనరల్ సెక్రటరీ అక్కేపల్లి లక్ష్మన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కేపల్లి లక్ష్మణ్ మరణం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన కార్యకర్తలకు ఒక తీరని లోటన్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీఆదర్శం."ఆయనపవిత్రఆత్మకుశాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావంత్ ,డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి , మాజీ ఎంపీ సోయం బాపురావు , మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ వేణుగోపాల చారి ,ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి , బోత్ నియోజకవర్గా ఇన్చార్జ్ ఆడే గజేంద్ర, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అను సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య , ,టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ ,జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి , ఇచ్చోడా మార్కెట్ కమిటీ చైర్మన్ కుమర సత్యవతి కోటేష్ మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ,ఆదిలాబాద్ మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ పాటిల్ , ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ ,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతిరామ్ , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్ , కాంగ్రెస్ ముఖ్య నాయకులు అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
Admin
E Nivas News