ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న విలేకరులకు ఆరోగ్య భీమ వర్తింపజేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. కాటారం మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ పాత్రికేయుల ప్రధాన డిమాండ్ లను వ్యక్తపరిచారు. వృత్తి పరంగా మృతి చెందిన కుటుంబానికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని, విలేకరులకు వైద్య సౌకర్యంతో పాటు ఆరోగ్య భీమాకల్పించాలి, కేరళ ప్రభుత్వం విలేకరులకు ఇస్తున్న ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్రంలో విలేకరులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షం చర్చించాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడంతో పాటు విలేకరులకు వృత్తిపరంగా ఎదురయ్యే సంఘటనల పట్ల రక్షణ కవచం బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలన్నారు. సమాజ సేవలో ముందుంటున్న విలేకరులకు పెద్ద పీట వేయాలని, వృత్తి పరంగా ఎదురయ్యే సంఘటనలు, సమస్యల పట్ల పాలక వర్గాల నుండి ఎదురయ్యే సమస్యలు అధిగ మించే విధంగా చట్టంలో పొందు పరచాలన్నారు. ప్రజా పాలనలో ఈసారైనా విలేకరులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని పీక కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు.
Admin
E Nivas News