ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుడుకొక్కిరాల సత్యపాల్ రావు లక్షెట్టిపేట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం పట్టణంలోని ఇటిక్యాల చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూమున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలపించాలన్నారు. ఇప్పటికే లక్షెట్టిపేట ఎంతో అభివృద్ధి చేశామని, వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే లక్షెట్టిపేట అభివృద్ధి సాధ్యమన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ లక్షెట్టిపేట కు చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం, మెట్పల్లి సత్యం, గోళ్ళ కాంతయ్య, దొంత నర్సయ్య, తొగరు రాజు, కండె మొగిలి, చెల్ల చెందు, లక్ష్మణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News