Friday, 19 June 2026 01:46:06 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 May 2026 11:34 PM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యంను కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని, ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . గురువారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల తహసిల్దార్లు పుష్పలత, దిలీప్ కుమార్ లతో కలిసి రాజరాజేశ్వర రైస్ మిల్ ను సందర్శించి ప్రక్రియ పరిశీలించిన అనంతరం గాయత్రి రైస్ మిల్ లో ఏర్పాటు చేసిన గోదామును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే వరి ధాన్యం తప్పనిసరిగా నిబంధనల ప్రకారం శుభ్రపరచి, నాణ్యత ప్రమాణాలు పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో లారీలు, హమాలీల కొరత, సమస్య లేకుండా ధాన్యం దిగుమతి త్వరగా పూర్తిచేసే విధంగా రైస్ మిల్లులు, లారీల యజమానులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అనంతరం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, గోదామును దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు, ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు రాకుండా, హమాలి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: