Thursday, 30 July 2026 12:27:07 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విజ్ డమ్ ప్రీ స్కూల్ లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు...

Date : 10 January 2026 01:45 PM Views : 386

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోనివిజ్ డమ్ ప్రీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా దాని కనుగుణంగా చక్కని వేషధారణతో, అలంకరించుకొని ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానోఅలరించాయి. సంస్కృతిసంప్రదాయాలకు అనుగుణంగా చిన్నారులు ధరించిన దుస్తులు, వేసిన ముగ్గులు చూపరులను ఎంతగానోఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది ఆధ్యాత్మికత, కుటుంబం, సంస్కృతిని కలిపే గొప్ప పండుగని, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గులు, భోగి మంటలు, డూడూ బసవన్నల సందడి, వాటి సంప్రదాయాలతో ఈ పండుగ కళకళలాడుతుందని, ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని, ఆత్మీయతను పెంపొందిస్తుందని వారు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫహీంసుల్తానా మాట్లాడుతూపంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు ఇది ఆనందాన్ని, సంపాదనను తెస్తుందని అందుకే అందరూ దీనిని పంటల పండుగ అని అంటారని పేర్కొన్నారు. చెడును విడిచిపెట్టి, మంచిని ఆహ్వానించడం, కొత్త శక్తితో ఉత్సాహంగా జీవించడం, దానధర్మాలు చేయడం, సంప్రదాయాలను పాటించడం ఈ పండుగ ముఖ్యాంశమని అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ఇన్చార్జి హారికలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరితా రాణి, దివ్య, మాధవి, రాధిక, స్వాతి, అఖిల, సౌజన్య, రవళి, సుజాత, రజనీ కుమారి, కళ్యాణి, శ్రీలత, భద్రయ్య లతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :