ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరి పేట పెట్రోల్ బంకు వద్ద మంగళవారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన వికలాంగుడు చల్ల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను బుధవారం దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో వారి ఇంటి వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లిసత్యనారాయణ మాట్లాడుతూబాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని పూర్తిగా పెట్రోల్ బంకు యజమాన్యం నిర్లక్ష్యం ద్వారానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని తెలిపారు బాధితులకు నష్టపరిహారం తో పాటు వారికి ఉపాధి చూపించాలని ఈ సందర్భంగా కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పరామర్శించిన వారిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో పాటు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ జిల్లా కన్వీనర్ బి వి అప్పారావు జిల్లా నాయకులు దేవి ప్రకాష్ మామిడి రాజశేఖర్ చిప్పకుర్తి సురేష్ దండేపల్లి మండల కమిటీ నాయకులు జంబోజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News