Friday, 31 July 2026 07:30:12 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించండి..

మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికలలో ఎమ్మెల్యే రామచంద్రునాయక్

Date : 05 February 2026 04:11 PM Views : 648

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 8వ వార్డు లో వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రునాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరలు, రెండు లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు 2 లక్షలు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని అన్నారు.ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే నాయకత్వం వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డికి ఉందని పేర్కొన్నారు. ఆమె విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, గంధసిరి అంబరీష,రాంలాల్, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, మచ్చ నర్సయ్య, కారంపొడి ఉపేందర్,పోన్నం విజయ్, వెంకన్న, నాన్య, మహేష్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :