Wednesday, 17 June 2026 02:00:26 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

కోకాపేట్ క్రషర్లపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవం...

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Date : 11 March 2026 10:50 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కోకాపేట్ క్రషర్లపై టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆరోపించారు. నియోపోలిస్ ప్రాంతంలోని క్రషర్లను బుధవారం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ మరియు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అక్రమ క్రషర్ల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు తగవని, నిజ నిర్ధారణ కమిటీకి కనీస వాస్తవాలు తెలియకుండానే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కోకాపేట్ భాగ్యలక్ష్మి క్రషర్ యూనిట్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల అనుమతి పత్రాలను ఆయన స్వయంగా మీడియాకు చూపించారు. అన్ని అనుమతులు ఉన్న క్రషర్లను అక్రమమని ప్రచారం చేయడం కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాల్లోభాగమేనని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :