Thursday, 30 July 2026 07:30:46 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Date : 10 December 2025 08:40 PM Views : 276

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ అనిత సూచించారు. వైద్యాధికారి ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా పాల్గొని వైద్య సిబ్బంది వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాజీపూర్ మరియు మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సందర్శించి తగు సూచనలు జారీ చేశారు. మండలంలోని వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో నిర్వహించిన వైద్య శిబిరంతోపాటు హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశ ఆరోగ్య కార్యకర్తల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పోలింగ్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని సమయపాలన పాటించాలని, అదేవిధంగా యూనిఫామ్ ను ధరించాలని, మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లరాదని, అత్యవసర మందులను ఫస్ట్ ఎయిడ్ గీతలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అలాగే మందుల వివరములను నమోదు చేసుకొని ఎక్స్పైరీ థియేటర్లను చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్షన్ మరియు కౌంటింగ్ అయ్యేవరకు ఆయా కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున స్థానిక ప్రజాప్రతినిధులతో గాని ఇతరులతో కలిసి తిరగరాదని సూచించారు. అదేవిధంగా 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల కోసం పైలెట్ మరియు ఇతరుల వివరములను దగ్గర ఉంచు కోవాలన్నారు. ఆర్బిఎస్కే బృందము మరియు వారి వాహనంలో సర్వీసులను తీసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి మరియు వైద్య సిబ్బంది వెంకటేశ్వర్, జిల్లా మాస్ మీడియా అధికారి లక్ష్మణస్వామి, హెచ్ఈఓ వైద్య సిబ్బంది రఘుపతి, సూపర్వైజర్లు ఆశ ఆరోగ్య కార్యకర్తలు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :