ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ అనిత సూచించారు. వైద్యాధికారి ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా పాల్గొని వైద్య సిబ్బంది వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాజీపూర్ మరియు మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సందర్శించి తగు సూచనలు జారీ చేశారు. మండలంలోని వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో నిర్వహించిన వైద్య శిబిరంతోపాటు హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశ ఆరోగ్య కార్యకర్తల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పోలింగ్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని సమయపాలన పాటించాలని, అదేవిధంగా యూనిఫామ్ ను ధరించాలని, మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లరాదని, అత్యవసర మందులను ఫస్ట్ ఎయిడ్ గీతలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అలాగే మందుల వివరములను నమోదు చేసుకొని ఎక్స్పైరీ థియేటర్లను చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్షన్ మరియు కౌంటింగ్ అయ్యేవరకు ఆయా కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున స్థానిక ప్రజాప్రతినిధులతో గాని ఇతరులతో కలిసి తిరగరాదని సూచించారు. అదేవిధంగా 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల కోసం పైలెట్ మరియు ఇతరుల వివరములను దగ్గర ఉంచు కోవాలన్నారు. ఆర్బిఎస్కే బృందము మరియు వారి వాహనంలో సర్వీసులను తీసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి మరియు వైద్య సిబ్బంది వెంకటేశ్వర్, జిల్లా మాస్ మీడియా అధికారి లక్ష్మణస్వామి, హెచ్ఈఓ వైద్య సిబ్బంది రఘుపతి, సూపర్వైజర్లు ఆశ ఆరోగ్య కార్యకర్తలు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News