Thursday, 30 July 2026 08:23:08 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాలం సునీత రవీందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించండి..

మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామచంద్రునాయక్

Date : 04 February 2026 03:18 PM Views : 522

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 6వ వార్డు లో కాలం సునీత రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రునాయక్ పాల్గొని, అనంతరం ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీర లు, రెండు లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే నాయకత్వం కాలం సునీత రవీందర్ రెడ్డికి ఉందని పేర్కొన్నారు. ఆమె విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాలం సునీత రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, గంధసిరి అంబరీష, కాలం రవీందర్ రెడ్డి, రాంలాల్, మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, గుండాగాని సుందర్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :