Wednesday, 17 June 2026 02:13:47 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల..

Date : 07 April 2026 01:22 AM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఏటపాక, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల,పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు . ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.భద్రాచలం పట్టణ అభివృ ద్ధికి పాలనా సౌలభ్యానికి ఈ గ్రామాలు అత్యంత కీలకమని, వీటిని తెలంగాణలో కలపడం ద్వారానే స్థానిక గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నా రు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన విలీన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.ఈ అంశం రెండ్రోజుల క్రితం రాజ్యసభలోనూ ప్రస్తావన కు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో తెలంగాణ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉండాలని కోరుకున్న గిరిజనులను బలవంతం గా ఏపీలో కలిపారని ఆమె మండిప డ్డారు. విభజన హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ వంటి అంశాల్లో కేంద్రం తెలంగాణ కు మొండిచేయి చూపిస్తోం దని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చట్టాన్ని వాడుకుంటున్నారని.. తక్షణమే ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించా లని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలం చుట్టూ ఉన్న ఈ గ్రామాలు భౌగోళి కంగా, సామాజికంగా తెలంగాణతోనే ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :