ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఏటపాక, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల,పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు . ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.భద్రాచలం పట్టణ అభివృ ద్ధికి పాలనా సౌలభ్యానికి ఈ గ్రామాలు అత్యంత కీలకమని, వీటిని తెలంగాణలో కలపడం ద్వారానే స్థానిక గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నా రు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన విలీన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.ఈ అంశం రెండ్రోజుల క్రితం రాజ్యసభలోనూ ప్రస్తావన కు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో తెలంగాణ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉండాలని కోరుకున్న గిరిజనులను బలవంతం గా ఏపీలో కలిపారని ఆమె మండిప డ్డారు. విభజన హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ వంటి అంశాల్లో కేంద్రం తెలంగాణ కు మొండిచేయి చూపిస్తోం దని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చట్టాన్ని వాడుకుంటున్నారని.. తక్షణమే ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించా లని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలం చుట్టూ ఉన్న ఈ గ్రామాలు భౌగోళి కంగా, సామాజికంగా తెలంగాణతోనే ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు.
Admin
E Nivas News