Wednesday, 08 April 2026 05:06:17 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల..

Date : 07 April 2026 01:22 AM Views : 17

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఏటపాక, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల,పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు . ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.భద్రాచలం పట్టణ అభివృ ద్ధికి పాలనా సౌలభ్యానికి ఈ గ్రామాలు అత్యంత కీలకమని, వీటిని తెలంగాణలో కలపడం ద్వారానే స్థానిక గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నా రు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన విలీన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.ఈ అంశం రెండ్రోజుల క్రితం రాజ్యసభలోనూ ప్రస్తావన కు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో తెలంగాణ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉండాలని కోరుకున్న గిరిజనులను బలవంతం గా ఏపీలో కలిపారని ఆమె మండిప డ్డారు. విభజన హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ వంటి అంశాల్లో కేంద్రం తెలంగాణ కు మొండిచేయి చూపిస్తోం దని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చట్టాన్ని వాడుకుంటున్నారని.. తక్షణమే ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించా లని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలం చుట్టూ ఉన్న ఈ గ్రామాలు భౌగోళి కంగా, సామాజికంగా తెలంగాణతోనే ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :