ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వ హించబడుతున్న మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పురుషుల గురుకుల డిగ్రీ కళాశాల (మంచిర్యాల) నందు ఖాళీగా ఉన్న సబ్జెక్టును బోధించుటకు అతిధి అధ్యా పక పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆర్ సి ఓ శ్రీ సేరు శ్రీధర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కు లు కలిగి ఉన్న వారు అర్హులని తెలిపారు. నెట్, సెట్, పి.హెచ్డీ లతో బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 15వ తేదీన (శనివారం) మంచిర్యాల జిల్లా లో నిర్వహించబడుతున్న మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగే డెమో మరియు ఇంటర్యూల కు హాజరు కాగలరు. అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కాగలరు. ఇతర వివరాలకు 9603705803, 8977568214 నంబర్లను సంప్రదించాలన్నారు.
Admin
E Nivas News