ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బోత్ నియోజకవర్గంలోని పిప్పిరిలో ఏప్రిల్ 6న జరగబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనులను రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు , వివేక్ వెంకట స్వామి , ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తో కలసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సమావేశంలో పాల్గొని ఏప్రిల్ 6న జరగబోయే ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News