ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో డాక్టర్ రాజేష్ ఎంబీబీస్ fellowship in diabetology, జనరల్ and షుగర్ వ్యాధి నిపుణులు, డాక్టర్ శిరీష ఎంబీబీస్ dnb పెడియాట్రిక్ పిల్లల వైద్య నిపునురాలు, డాక్టర్ నవీన ఎంబీబీస్ లు కాకతీయ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు నిర్వహించి పిల్లలకు ఆరోగ్య సంబంధిత అనేక విషయాలను పిల్లలకు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజుల్లో ఇలాంటి మెగా క్యాంపులు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పాఠశాల ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో opthalmist బుద్ధర్తి సతీష్ కుమార్, పాఠశాల డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, పావని, స్రవంతి మరియు విద్యార్థిని విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News