ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని పాచ్ఛంపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న జూగ్నక్ వనిత గంగాధర్ ను గెలిపించాలని కోరారు. గ్రామస్తులంత బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసిన వారిని గెలిపించుకుంటే ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో 10 సంవ్వస్సరాలు అధికరం లో ఉన్న పార్టీలు గ్రామాలకు చేసింది ఏమి లేదని, స్థానిక ఎమ్మెల్లే కార్లు వేసుకొని రౌడీలతో తిరుగుడు తప్ప పని చేసింది ఏమి లేదన్నారు.ప్రచార కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చేర్మెన్ సేద్మకి ఆనంద్ రావు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News