ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం మాగనూరు మండలం జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా చేస్తుండగా వారికి మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా మద్దతు పలికారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కపాస్ కిసాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచాలని చూస్తుందన్నారు. అంతేగాకుండా విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవాలని చూస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపితే కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయరా అని ఆయన ప్రశ్నించారు. అంతేగాకుండా 8,12% తేమ పేరుతో రైతులను ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బిజెపి ఎంపీలు కూడా పీఎం అనిదృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల అనాలోచిత నిబంధనలను పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు. కొనుగోలు ప్రారంభించకపోవడంతో పత్తి రైతు చేసేదిలేక కొనుగోలు ప్రారంభించకపోవడంతోపత్తిని దళారికి అమ్మితే 5,900 రూపాయలు అమ్మితేమాత్రమే ఇవ్వడం జరుగుతుందని తద్వారా 1200 రూపాయలు నష్టపోవడం జరుగుతుందన్నారు. ఈనెల 21న బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో తమ పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News