ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కరీంనగర్ వైపు వెళుతున్న మంథని డిపో బస్సులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమ నిబంధనలను పాటించకుండా డిపో అధికారులు ఇష్టమైన రీతిలో బస్సులను సంబంధిత రూట్లకు పంపిస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెెంకల సురేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సోమవారం మంథని నుండి కరీంనగర్ వెళ్తున్న TS22 T 7244 పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను కొంత ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు ప్రయాణికులకు బస్సు ఎక్కేముందే ఎక్స్ ప్రెస్ అని చెప్పాము కదా అని ఆ బస్సు కండక్టర్ సమాధానం చెప్పసాగారు. మంథని డిపో నుండి గత కొద్ది రోజులుగా పల్ల వెలుగు ఆర్డినరి బస్సులను వేసి ఎక్స్ ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని గతంలో కొన్ని పత్రిక ప్రకటనలు వచ్చినప్పటికీని మంథని డిపో యాజమాన్యం తీరు మారడం లేదన్నారు. పల్లె వెలుగు బస్సులు వేసి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తు పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్న మంథని బస్సు డిపో మేనేజర్ పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Admin
E Nivas News