Monday, 15 June 2026 02:53:40 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం...

మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య

Date : 01 March 2026 09:50 PM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో గల 6వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆదివారం వార్డులోని పలు వీధులను సందర్శించి స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా 6వ వార్డు కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్ వార్డులో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ కాలువలు, సి.సి. రోడ్లు, వీధి దీపాల సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు. విన్నపాలపై సానుకూలంగా స్పందించారు. అనంతరం చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి తమ వార్డుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ తోట సువర్ణ రమేష్, వార్డు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మోతుకూరి రాజేశ్వరి వెంకటస్వామి, వార్డు ప్రముఖులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :