ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కుడితి సాయి ప్రియా నరసింహారెడ్డి సోమవారం ఇంటింటిని విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. 13వ వార్డులోని కాంగ్రెస్ బజారులో ప్రజలను నేరుగా కలుస్తూ తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ సారధ్యంలో వారి సూచనల తో 13వ వార్డు వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, తమను భారీ మెజార్టీతో గెలిపించాలని, 13వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డులో ఉన్న ప్రజా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇంటింటికి సన్న బియ్యం, కళ్యాణ లక్ష్మి, రైతులకు రుణమాఫీ, క్వింటాకు 500 రూపాయల బోనస్, వంటి పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని, ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. వారి వెంట, ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉప్పల మధు, కుడితి వెంకట్ రెడ్డి, చింతల వెంకన్న, లక్ష్మారెడ్డి, ఉప్పల సత్యం, దేవరశెట్టి కృష్ణమూర్తి, ముదిరెడ్డి నరేష్, గంధసిరి కృష్ణమూర్తి, దేవరశేట్టి శ్రీకాంత్, మధు, భాస్కర్, వెంకటేశ్వర్లు, దేవరశెట్టి నిర్మల్ రాజు, ఉపేందర్, మహిళా కార్యకర్తలు భయ్యా నిర్మల, సుభద్ర, నరస్సమ్మ, దేవరశెట్టి ధనమ్మ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News