Thursday, 02 April 2026 01:52:03 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

ఖానాపూర్ డబల్ బెడ్ రూమ్ లో పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించి అనరులను తొలగించాలని కలెక్టర్ కు వినతి

Date : 24 November 2025 09:17 PM Views : 153

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కొమరం భీమ్ చౌరస్తాలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఇండ్లలో అనర్హులను తొలగించి, అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ(యు), డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలోనిర్మల్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునరికారి రాజేష్, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ లు మాట్లాడుతూ ఖానాపూర్ డబల్ బెడ్రూములలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లను కేటాయించారని గత కొన్ని నెలల నుండి అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తీసుకువచ్చినప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నామమాత్రంగా సర్వే చేసి కొంత లిస్టు పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూయించలేదు. మిగతా వాటిలో విచారణ జరపడంలో జాప్యం జరుగుతుందని, ఎప్పుడు పూర్తిస్థాయి లో విచారణ చేస్తారో ఇంకెంతకాలం గడుపుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్హులైన పేదల కోసం కేటాయించిన ఇండ్లను వారికి చెందకుండా ఇతరులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా తొందరనే పరిష్కారం చేసి నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, తోటరాద, కమల, గౌస్, షాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :