ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కొమరం భీమ్ చౌరస్తాలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఇండ్లలో అనర్హులను తొలగించి, అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ(యు), డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలోనిర్మల్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునరికారి రాజేష్, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ లు మాట్లాడుతూ ఖానాపూర్ డబల్ బెడ్రూములలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లను కేటాయించారని గత కొన్ని నెలల నుండి అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తీసుకువచ్చినప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నామమాత్రంగా సర్వే చేసి కొంత లిస్టు పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూయించలేదు. మిగతా వాటిలో విచారణ జరపడంలో జాప్యం జరుగుతుందని, ఎప్పుడు పూర్తిస్థాయి లో విచారణ చేస్తారో ఇంకెంతకాలం గడుపుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్హులైన పేదల కోసం కేటాయించిన ఇండ్లను వారికి చెందకుండా ఇతరులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా తొందరనే పరిష్కారం చేసి నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, తోటరాద, కమల, గౌస్, షాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News