ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మారిస్తే నిరుపేదల పొట్ట కొట్టడం ఖాయమని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమనూరీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇబ్రహీంపల్లి, అంకుశాపూర్, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభలు నిర్వహించారు. 2006 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పేదవానికి రక్షణ కల్పించే దిశగా ఉపాధి చట్ట రూపకల్పన చేయడం జరిగిందన్నారు. దాన్ని చట్ట రూపం దాల్చి హక్కుగా పెట్టడంతో ఇది గిట్టని కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల పొట్ట కొడుతుందని ఆరోపించారు. చట్టంలోని డిమాండ్ ను తొలగించి సప్లై అంశాన్ని తీసుకువచ్చి కూలీల పనితనాన్ని తగ్గించి మళ్లీ యంత్రాలను ఉపయోగించుకునేలా చట్ట రూపకల్పన చేసినారని ఆరోపించారు. ఇది ఉపాధి హామీ చట్ట నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అలాగే కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ మండల పరి షత్ గ్రామపంచాయతీ అధికారాలను, హక్కును కాలరాసింది. పేదవాడిని పొట్ట కొట్టే దిశగా గతంలో 90 రోజుల పని దినాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించగా నేడు 125 రోజుల పేరుతో రాష్ట్రాలపై భారం నెట్టి కేవలం 70 రోజులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మిగతా 55 రోజులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిబంధన విధించింది. ఇది పూర్తిగా ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ చట్టానికి విరుద్ధమని అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనులను నిర్ణయించుకునే అధికారం కూలీలకు గ్రామస్తులకు ఉండేది కానీ నేడు ఈచట్ట మార్పు వల్ల ఆ అధికారాన్ని కోల్పోయి సంవత్సరానికి 60 రోజులను క్రాప్ హాలిడే పేరిట గ్రామీణులను వారి జీవితాలను ఆగం. ఇంత తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న మోడీ చర్యలను తీవ్రంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, సర్పంచులు దెబ్బట సరోజన రాజేష్, సోదారి కల్పన దేవయ్య, ఉపస ర్పంచ్ కర్క ఉమా శంకర్, చీర్ల తిరుపతిరెడ్డి, చాంద్ పాషా, ఆత్మకూరి కుమార్ యాదవ్, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News