ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరులో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.జవహర్ ని డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాల శాలువతో సత్కరించడం జరిగింది. కేజీఎన్ ఫంక్షన్ హాల్ నందు బేడ బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు కుమార్తె వివాహానికి హాజరైన సందర్భంగా.కే.జవహర్, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, తదితర ప్రజా సంఘాల నాయకులతో కలిసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం నందికొట్కూరు నియోజకవర్గంలోని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు విజ్జి, ప్రేమ రాజు, రామకృష్ణ, దుద్యాల నాగన్న , ఏబీఎమ్ పాలెం జాన్. పరిమళ రాజు, నాగ సురేష్. లక్ష్మి మెడికల్ కె.నాగన్న. సిపిఐ-రమేష్.దిలిప్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News