Saturday, 13 June 2026 02:58:15 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి-నేరాల నియంత్రణకు వ్యాపారులు సహకరించాలి

పి.తిరుపాలు పాములపాడు ఎస్ఐ

Date : 26 May 2026 05:44 AM Views : 96

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలం ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై- పి.తిరుపాలు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పాములపాడులోని, అన్ని దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై పి.తిరుపాలు మాట్లాడుతూ . నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి షాపు, వ్యాపార సముదాయంలో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాల వ్యవస్థ అవసరమని సూచించారు. అలాగే పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు జాగ్రత్తలు సూచించారు అనంతరం వ్యాపారులందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రజలు, వ్యాపారులు పోలీసు శాఖకు సహకరించి తమ పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎం.వి.రమణ, కానిస్టేబుల్ లు ఏ.ఖాజా, టావేశ్వర్, వ్యాపారస్తులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :