ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : అన్నం చితికి పోకుండా విద్యార్థులకు వండి పెట్టాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్తు హైస్కూలును తనిఖీ చేసి, ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ హైస్కూల్ లలో వంట మనుసులు అన్నం చితికి పోకుండా, ఒండి తాజా కూరగాయలు తెచ్చి లావుగా తరగకుండా సన్నగా తరిగి కూరలు వండి విద్యార్థులకు పెట్టాలని ఆయన అన్నారు. అదే మాదిరిగా స్కూల్ హెడ్మాస్టర్ అనునిత్యం కూరగాయలను పరీక్షించి పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. మెనూ ప్రకారం వండిపెట్టాలని, పిల్లలను బాగా చూసుకోవాలని ఆయన కోరారు. నిర్లక్ష్యం చేసి ఏవైనా లోపాలు జరిగి పిల్లలకు ఏదైనా జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News